కొనసాగుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
ABN , First Publish Date - 2021-06-24T05:46:27+05:30 IST
సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో చేపట్టిన ఆందోళన బుధవారం కొనసాగింది.
గుంటూరు, జూన్ 23(ఆంధ్రజ్యోతి): సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో చేపట్టిన ఆందోళన బుధవారం కొనసాగింది. చుట్టుగుంట సెంటర్లోని ఉద్యాన వనశాఖ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆందోళనకు ఔట్సోర్సింగ్ ఉద్యో గుల జేఏసీ నాయకులు దూసి భానూజిరావు, పవన్కుమార్, సునీత, అక్రమ్, రమణ, భ్రమరాంబ, శివప్రసాద్ తదితరులు నాయకత్వం వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు.