25 నుంచి Exhibition పునఃప్రారంభం..

ABN , First Publish Date - 2022-02-15T12:05:46+05:30 IST

81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ఈనెల 25 నుంచి తిరిగి

25 నుంచి Exhibition పునఃప్రారంభం..

హైదరాబాద్‌ సిటీ : 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ఈనెల 25 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం ప్రకటించారు. ఏటా జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి రెండో వారంలో ముగుస్తుంది. ఈ ఏడాది కూడా జనవరి 1న  గవర్నర్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అయితే ఒమైక్రాన్‌ తీవ్రతతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజుల్లోనే ఎగ్జిబిషన్‌ను మూసేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో ఎగ్జిబిషన్‌ను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన సొసైటీ పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో నిర్వహణ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 25 నుంచి ఎగ్జిబిషన్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగుతుంది. వారాంతపు రోజుల్లో రాత్రి 11గంటల వరకు కొనసాగుతుందని సెక్రటరీ ప్రకటించారు.

Updated Date - 2022-02-15T12:05:46+05:30 IST