ఉద్యమాలతో హక్కుల సాధన
ABN , First Publish Date - 2021-08-04T05:33:10+05:30 IST
ఉద్యమాలతోనే హక్కులు సాఽధించవచ్చని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ సభ్యుడు బల్లెడ లక్ష్మణమూర్తి తెలిపారు.
ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ సభ్యుడు లక్ష్మణమూర్తి
కవిటి: ఉద్యమాలతోనే హక్కులు సాఽధించవచ్చని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ సభ్యుడు బల్లెడ లక్ష్మణమూర్తి తెలిపారు. మంగళ వారం బొరివంకలో ఏపీటీఎఫ్ మండలాధ్యక్షుడు బల్ల ధర్మా రావు అధ్యక్షతన సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ పెండింగ్ డీఏ, పీఆర్సీ బకాయిలు, సీపీ ఎస్ రద్దు వంటి సమస్యల పరిష్కారానికి నిరసన బాట పట్టనున్నట్లు తెలిపారు. పాఠశాలల విలీనం వల్ల ఉపాధ్యాయు ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని, రోజుకో ఉత్తర్వు లతో గందరగోళంగా తయారుచేస్తున్నారని తెలిపారు. అనం తరం సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ జిల్లాకార్యదర్శి ఎం.గోపి, ప్రఽధాన కార్యదర్శి ఎస్. రాజ బాబు, రంగరావు పాల్గొన్నారు.
బకాయిలను వెంటనే విడుదల చేయాలి
ఎచ్చెర్ల: విద్యా, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ శాఖ అధ్యక్షుడు పాలం నాసరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ వర్సిటీలో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా, వసతి దీవెన లోటుపాట్లపై చర్చించారు. గత ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంటు అందజేసిందని, ప్రస్తుత ప్రభు త్వం 10 లక్షల మందికి మాత్రమే వర్తింపజేయడం సరికాదన్నారు. కార్యక్ర మంలో ఎస్ఎఫ్ఐ వర్సిటీ శాఖ ప్రధాన కార్యదర్శి మట్ట రవి, కోశాధికారి రాజు, నాయకులు మోహన్బాబు, ఆనంద్, కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.