ఉత్సాహంగా రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలు
ABN , First Publish Date - 2021-04-15T05:38:54+05:30 IST
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జామి ఏబీనగర్లో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలను నిర్వహించారు.
శృంగవరపుకోట
రూరల్(జామి) ఏప్రిల్ 14 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి
సందర్భంగా జామి ఏబీనగర్లో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి
రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీకాకుళం,
విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, కొత్తవలస ఎస్టీ అకాడమీతోపాటు జామి
ఏబీనగర్ టీం, మరో 19 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను గ్రామానికి చెందిన
రిటైర్డ్ పీటీ చుక్క సూర్యనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సీ సంఘ
నాయకులు, గ్రామపెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలు
చూసేందుకు సమీప గ్రామాలనుంచి అధికసంఖ్యలో ఔత్సాహికులు తరలివచ్చారు.