ఉరకలెత్తిన ఉత్సాహం
ABN , First Publish Date - 2022-08-12T05:50:57+05:30 IST
ఉరకలెత్తిన ఉత్సాహం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రీడమ్ రన
కొత్తగూడెం (ఆంధ్రజ్యోతి) / ఖమ్మం స్పోర్ట్స్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్లో యువత ఉత్సాహం ఉరకలెత్తింది. మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ పాదం.. పాదం కలిపారు. త్రివర్ణ పతాకాలను చేతబూనిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, యువతీయువకులు, విద్యార్థులు ‘భారత మాతాకీ జై’ అంటూ నినదించారు. ఇరుజిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ జాతీయజెండాలతో ప్రదర్శనలు నిర్వహించి దేశభక్తిని చాటారు. మానవహారాలు నిర్వహించారు. ఖమ్మంలో జిల్లా క్రీడాప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె ఫ్రీడమ్ రనను సర్ధార్పటేల్ స్టేడియం నుంచి జడ్పీ చైర్మన లింగాల కమల్రాజ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ క్రీడా జ్యోతిని వెలిగించి, జెండా ఊపి ప్రారంభించారు. లకారం ట్యాంక్బండ్ వరకు సాగిన ఈ రన్లో సుడా ఛైర్మన బచ్చు విజయ్కుమార్, అదనపు కలెక్టర్లు స్నేహలతా మొగిలి, ఎన. మధుసూదనరావు, ఏడీసీపీ శబరీష్, కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శసురభి, డీఆర్వో శిరీష, డీఆర్డీవో విద్యాచందన, ఏసీపీలు ఆంజనేయులు, రామోజీ రమేష్, ప్రసన్నకుమార్, డీవైఎ్సవో పరంధామరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరావు, కోచలు గౌస్, అక్బర్అలీ క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఎనసీసీ, ఎనఎ్సఎ్స వాలంటీర్లు పాల్గొన్నారు. ఇక కొత్తగూడెంలో పోస్టాఫీ్ససెంటర్ నుంచి మొర్రేడు బ్రిడ్జి వరకు నిర్వహించిన 2కెరన్ను జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్ లు త్రీవర్ణ రంగుల బెలూన్లను వదిలి ప్రారంభించారు.