వెల్లివిరిసిన సేవా నిరతి

ABN , First Publish Date - 2022-08-20T05:36:59+05:30 IST

వెల్లివిరిసిన సేవా నిరతి

వెల్లివిరిసిన సేవా నిరతి
కొత్తూర్‌: పీహెచ్‌సీలో పండ్ల్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

కొత్తూర్‌/చేవెళ్ల/శంకర్‌పల్లి/మొయినాబాద్‌ రూరల్‌/యాచారం/షాద్‌నగర్‌ అర్బన్‌/ఆమనగల్లు/ఆదిభట్ల//ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో ప్రజాప్రతినిధులు, పోలీసులు సేవా నిరతిని చాటారు. శుక్రవారం కొత్తూర్‌ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న వారికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్య దేవేందర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ రాములు, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ వీరేందర్‌, డాక్టర్‌ కార్తీక్‌ పాల్గొన్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కాలె యాదయ్య రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, కృష్ణారెడ్డి, యాదయ్యగౌడ్‌, అబ్దుల్‌ ఘనీ ఉన్నారు. శంకర్‌పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌ పండ్లు పంపిణీ చేశారు. చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు శ్వేతా పాండురంగారెడ్డి, శ్రీనాథ్‌గౌడ్‌, అశోక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మొయినాబాద్‌లో సీడీపీవో శోభారాణి ఆధ్వర్యంలో మండలంలోని కాశీంబౌళి గ్రామ సమీంపలోని రెడ్‌క్రా్‌ససొసైటీలో గల  వృద్ధాశ్రమంలో వృద్ధులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.  సీఐ డీకే లక్ష్మీరెడ్డి, ఎంపీపీ నక్షత్రం జయవంత్‌, జడ్పీటీసీ శ్రీకాంత్‌, ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐలు శిరీష, ప్రణయ్‌తేజ్‌రెడ్డి, సర్పంచ్‌ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ ఆధ్వర్యంలో స్థానిక నవోదయ వృద్ధాశ్రమం, మలయాళస్వామి వృద్ధాశ్రమాల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు. సీఐ నవీన్‌కుమార్‌, కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు సలేంద్రం రాజేశ్వర్‌, ఈగ వెంకటరాంరెడ్డి, బచ్చల నర్సింహులు, జీటీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. యాచారంలో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపీణీ చేశారు. ఎంపీవో ఉమారాణి, డాక్టర్‌ ఉమ, తక్కళ్లపల్లి ఉపసర్పంచ్‌ పగడాల శ్రీశైలం ఉన్నారు. అదేవిధంగా ఆమనగల్లులోని ప్రభుత్వ ఆసుపత్రిలో, బస్టాండ్‌ కూడలిలో మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌లు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్‌ జయశ్రీ, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గోరటి నర్సింహ, కౌన్సిలర్లు చెన్నకేశవులు, విక్రమ్‌రెడ్డి, శ్రీధర్‌, ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది రామకృష్ణ, సాయి పాల్గొన్నారు. అదేవిధంగా ఆదిభట్ల పరిధి నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథ ఆశ్రమంలో సీఐ నరేందర్‌ ఆధ్వర్యంలో 16 క్వింటాళ్ల బియ్యం, పండ్లు తదితర నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆశ్రమ నిర్వాహకుడు రవిని అభినందించారు. ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, సురే్‌షకుమార్‌, జె.లక్ష్మీనారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ రాజు, రమే్‌షగౌడ్‌, ప్రసాద్‌గౌడ్‌ ఉన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం సమీపంలోని మాతాపితరుల ఆశ్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, ఎంపీడీవో జయరాం విజయ్‌, ఎంపీవో లక్పతి నాయక్‌, సీడీపీవో సుజని పండ్లు పంపిణీ చేశారు. 

Updated Date - 2022-08-20T05:36:59+05:30 IST