విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
ABN , First Publish Date - 2022-08-15T05:55:55+05:30 IST
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
తలకొండపల్లి, ఆగస్టు 14: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని రాష్ట్ర, జాతీయ స్థాయి ల్లో రాణించాలని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్నారు. విద్యార్థు లు, క్రీడాకారులకు చేయూతనివ్వాలన్నారు. తలకొండపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం 450 మంది విద్యార్థులకు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడా దుస్తులను ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్తో కలిసి పంపిణీ చేశారు. దేహ దారుఢ్యానికి, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. నియోజకవర్గంలో 5వేల మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశా మని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత, లక్ష్మణ్నాయక్, దేవులా నాయక్, శేఖర్, మల్లేష్, రవికుమార్, లక్ష్మారెడ్డి, రవి, జైపాల్రెడ్డి, మల్లేష్, శ్రీను, దశరథ్ పాల్గొన్నారు.