భవిత కేంద్రంలో రికార్డుల పరిశీలన
ABN , First Publish Date - 2022-01-21T04:38:52+05:30 IST
పరవాడలోని దివ్యాంగుల భవిత కేంద్రాన్ని జిల్లా సహాయ సమగ్ర శిక్షా సమన్వయకర్త సీహెచ్ దయాసాగర్ గురువారం సందర్శించారు.
పరవాడ, జనవరి 20: పరవాడలోని దివ్యాంగుల భవిత కేంద్రాన్ని జిల్లా సహాయ సమగ్ర శిక్షా సమన్వయకర్త సీహెచ్ దయాసాగర్ గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన భవిత కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. టీచింగ్ మెటీరియల్స్, ఆటల పరికరాలను పరిశీలించారు. అనంతరం సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించనున్న భవిత కేంద్రం స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలని ఈ సందర్భంగా టీచర్లు కుమారి, శ్రీనివాసరావుకు సూచించారు. కేంద్రం పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.