దాడులకు టీడీపీ భయపడదు
ABN , First Publish Date - 2021-10-21T05:09:20+05:30 IST
ప్రభుత్వ ప్రేరేపిత దాడులకు టీడీపీ భయపడి వెనకంజ వేసే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు.
ధూళిపాళ్ల నరేంద్రకుమార్
పొన్నూరుటౌన్, అక్టోబరు 20ః ప్రభుత్వ ప్రేరేపిత దాడులకు టీడీపీ భయపడి వెనకంజ వేసే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. టీడీపీ తలపెట్టిన బంద్లో పాల్గొన్ని నిరసన తెలపడాకికి వెళ్తున్న నరేంద్రకుమార్ను బుధవారం అరెస్టు చేసిన అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు నడుస్తున్నాయన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగా పోలీసుల అండతో టీడీపీ నాయకులు, కార్యాలయాలపై దాడులు చేయించిందని ఆరోపించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో ప్రశ్నిస్తున్న తమ గొంతుకులను అణచివేయాలని చూడటం ఆశ్చర్యకరమన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తిని టీడీపీ నాయకులే గుర్తించి మంగళగిరి పోలీసులకు అప్పగించారన్నారు. దీనిపై పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ, నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద కేసులు నమోదు చేయడం డీజీపీ ఏ విధంగా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే ఫిర్యాదు చేయడానికి చంద్రబాబు ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడే సమయం కూడా డీజీపీ లేదా అని ప్రశ్నించారు. ముంద్రా పోర్టులో అత్యంత విలువైన మత్తు పదార్ధాలు పట్టుపడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దాని చిరునామా విజయవాడలో ఉండగా ఆ సంస్థ నిర్వాహకుడి స్వస్థలం కాకినాడగా చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో గంజాయి, గుట్కా, మాదక ద్రవ్యాలు, సింగిల్ నెంబర్ బెట్టింగ్లు జరగని ప్రదేశం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలే ఎదురుతిరిగి వైసీపీని పతనావస్థకు తీసుకువెళ్తారని ప్రశ్నించారు.