కరోనాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-21T06:10:54+05:30 IST

కరోనాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.

కరోనాతో ప్రతి ఒక్కరూ  అప్రమత్తంగా ఉండాలి
పారిశుధ్య కార్మికులకు దుస్తులు అందజేస్తున్న చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ

సూర్యాపేటటౌన్‌, ఏప్రిల్‌ 20 : కరోనాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో సువెన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్మికులకు ఆఫ్రాన్స్‌, గ్లౌజులు, హైపోక్లోరైడ్‌ సామాగ్రిని మంగళవారం అందజేసి, మాట్లాడారు. కరోనా నివారణలో పారిశుధ్య కార్మికులు చూపిన తెగువ వెలకట్టలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు      ధరించి, భౌతికదూరం పాటించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, కౌన్సిలర్‌ తాహేర్‌పాష, సుంకరి రమేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:10:54+05:30 IST