వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-08T03:53:43+05:30 IST

వన్యప్రా ణుల సంరక్షణతోపాటు అడవుల సంర క్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవా లని జిల్లా అటవీఅధికారి దినేష్‌కుమార్‌ అన్నారు.

వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి
ర్యాలీ నిర్వహిస్తున్న అటవీ అధికారులు

- జిల్లా అటవీ శాఖాధికారి దినేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 7: వన్యప్రా ణుల సంరక్షణతోపాటు అడవుల సంర క్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవా లని జిల్లా అటవీఅధికారి దినేష్‌కుమార్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్స వం పురస్కరించుకుని ఆసిఫాబాద్‌, రెబ్బెన రేంజ్‌ కార్యాలయాల సిబ్బందితో శుక్రవారం జిల్లాకేంద్రంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారి దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ అడవుల సంరక్షణతో వాతావరణ సమ తుల్యత సాధ్యమవుతుందన్నారు. కేవలం అటవీ అధికారులతో మాత్రమేసంరక్షణ సాధ్యం కాదని దీనిలోప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్య క్రమంలో రేంజ్‌ అధికారి అప్పలకొండ, డిప్యూటీ రేంజ్‌ అధికారులు యోగేష్‌, ప్రవీణ్‌కుమార్‌, సరోజరాణి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T03:53:43+05:30 IST