ఉపాధి హామీలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-06-22T04:47:53+05:30 IST
ఉపాధిహామి పథకంలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉపాధి కూలీలు సోమవారం ధర్నా నిర్వహించారు.
రైల్వేకోడూరు, జూన్ 21: ఉపాధిహామి పథకంలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉపాధి కూలీలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నేతలు గంపల దేశయ్య, మారయ్య, జైక్రిష్ణ, మురగయ్య, శంకరయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులం ఆధారంగా దళితులకు, ఇతరులకు వేర్వేరుగా వేతనాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణం ఈ విధానాన్ని ఉపసంహరించుకుని అందరికీ సమానం వేతనాలు ఇవ్వాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్, మహిళా సంఘం నాయకురాళ్లు నారాయణమ్మ, ఎన్.మనెమ్మ, జి. సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.