ధర్మరక్షణకు అందరూ ముందుండాలి

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

ఆధ్యాత్మిక పునాదుల పైనే ధర్మం నిలబడుతుందని

ధర్మరక్షణకు అందరూ ముందుండాలి
ఆగాపల్లిలో పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

మంచాల, ఆగస్టు 16: ఆధ్యాత్మిక పునాదుల పైనే ధర్మం నిలబడుతుందని ధర్మరక్షణకు ప్రతిఒక్కరూ ముందుండాలని ప్రముఖ చండీ ఉపాసకులు రేవల్లిరాజుశర్మ అన్నారు. మండలంలోని ఆగాపల్లిలో ఇబ్రహీంపట్నంకు చెందిన బర్ల జగదీశ్వర్‌యాదవ్‌, గండికోట జంగయ్యలు నిర్మించిన పోచమ్మ ఆలయంలో మంగళవారం విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. గణపతి పూజ, పుణ్యవాచకం, మహాగణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు మడుపు నటరాజశర్మ, శ్రీనివా్‌సగుప్త, సర్పంచ్‌ జంగయ్యయాదవ్‌, శేఖర్‌గౌడ్‌, ఆకులయాదగిరి, భరత్‌, కౌన్సిలర్లు మమతశ్రీనివా్‌సరెడ్డి, పద్మమల్లేష్‌, నీలంశ్వేత నీలంభాను పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST