ప్రతీ విద్యార్థి క్రీడల్లో నైపుణ్యం సాధించాలి
ABN , First Publish Date - 2022-08-16T06:00:19+05:30 IST
ప్రతీ విద్యార్థి క్రీడారంగంలో నైపుణ్యం సాధించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు
దౌల్తాబాద్, ఆగస్టు 15: ప్రతీ విద్యార్థి క్రీడారంగంలో నైపుణ్యం సాధించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. సోమవారం లింగరాజుపల్లి మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడాకారులకు 95-96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బహుమతుల ప్రదానోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. అనంతరం (డీఎ్సపీఎఫ్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలో 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 75 రకాల పండ్ల మొక్కలను నాటారు. అనంతరం సూరంపల్లి గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకుడు ముత్యాల శ్రీనివాస్ తండ్రి మృతిచెందిన విషయాన్ని తెలుసుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభారాణి, డాక్టర్ సుధాకర్, సర్పంచ్ కేత కనకరాజు తదితరులు పాల్గొన్నారు.