కేసీఆర్కు రాజ్యాంగం మీద గౌరవం లేదు: ఈటల
ABN , First Publish Date - 2022-04-14T17:42:08+05:30 IST
సీఎం కేసీఆర్కు రాజ్యాంగంపై గౌరవం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు రాజ్యాంగంపై గౌరవం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడం చేతకాని ముఖ్యమంత్రి రాజ్యాంగం మార్చాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. సీఎం కేసీఆర్ దళిత జాతిని అవమానిస్తున్నారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచకుండా.. అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్, జగ్జివన్రామ్కు ఏడేళ్లలో కేసీఆర్ ఏనాడు పూలదండ వేయలేదని ఈటల రాజేందర్ అన్నారు.