నిరాశ్రయులకు వసతి ఏర్పాటు: మెప్మా పీడీ
ABN , First Publish Date - 2020-03-28T10:16:50+05:30 IST
కొవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు కాకినాడ రామారావుపేటలోని పట్టణ పేదరిక విశ్రాంతి
కార్పొరేషన్ (కాకినాడ) మార్చి 27: కొవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు కాకినాడ రామారావుపేటలోని పట్టణ పేదరిక విశ్రాంతి సముదాయంలో నిరాశ్రయులకు వసతి ఏర్పాటు చేశామని మెప్మా పీడీ సీహెచ్ నాగనరసింహారావు తెలిపారు. ఇందులో ఏర్పాటు చేసిన పడకలను సామాజిక దూరం పాటించి ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం షెల్టర్ను సందర్శించిన ఆయన ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్ల మీద ఎవరూ తిరగకుండా ఉండేందుకు నిరాశ్రయులకు, యాచకులకు, మతిస్థిమితంలేనివారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు.