ఉద్యోగాల సాధనకు పట్టుదలతో ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2021-01-25T05:42:40+05:30 IST

ఉద్యోగాల సాధనకు పట్టుదలతో ముందుకెళ్లాలి

ఉద్యోగాల సాధనకు పట్టుదలతో ముందుకెళ్లాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 

ఇబ్రహీంపట్నం: యువత ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో ముందుకెళ్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించగలరని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,567 మంది యువతీ, యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే ఐదేళ్ల కాలంలో లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన కేసీఆర్‌ ప్రభుత్వం మరో యాభైవేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసిందన్నారు. గతంలో తమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొంది 386 మంది పోలీస్‌ ఉద్యోగాలు సాధించారని, ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సారి ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మున్ముందు డీఎస్సీ అభ్యర్థులకు కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో శిక్షణకు హాజరవుతున్నారని తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐలు సైదులు, స్వామి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ కృపేష్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, చీరాల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:42:40+05:30 IST