నిధుల దుర్వినియోగంపై విచారణ
ABN , First Publish Date - 2021-01-19T05:59:41+05:30 IST
ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై డీఎంఈ విచారణకు ఆదేశించారు.
కర్నూలు(హాస్పిటల్), జనవరి 18: ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై డీఎంఈ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.బాబు లాల్ను నియమించారు. ఈ నెల 20వ తేదీన కంటి ఆసుపత్రిలో విచారణ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్తో పాటు గతంలో పని చేసిన ఏవో కూడా హాజరు కావాలని, హెచ్డీఎస్ నిధులకు సంబంధించిన క్యాష్బుక్, బ్యాంక్ చెక్బుక్, బ్యాంక్ స్టేట్మెంట్, పే బిల్లులు తీసుకురావాలని ఆదేశించారు.