హఫిజ్ సయీద్‌పై ఈడీ ఛార్జ్‌షీట్

ABN , First Publish Date - 2020-10-02T05:00:46+05:30 IST

ముంబై: లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫిజ్ సయీద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

హఫిజ్ సయీద్‌పై ఈడీ ఛార్జ్‌షీట్

ముంబై: లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫిజ్ సయీద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. లష్కర్‌కు  సహాధ్యక్షుడిగా పనిచేస్తున్న షాహిద్ మెహమూద్‌పై, అలాగే ఢిల్లీ కేంద్రంగా ఉన్న హవాలా డీలర్‌‌తో పాటు మరికొందరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మనీ లాండరింగ్‌‌తో పాటు ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చడంపై ఈ ఛార్జ్‌షీట్ దాఖలైంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్‌పై ఎన్‌ఐఏ ఇప్పటికే పెట్టిన ఓ కేసుకు సంబంధించి ఈడీ ఈ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.


హఫిజ్ సయీద్ 2008లో ముంబైపై దాడికి సూత్రధారి. నాటి దాడిలో 164 మంది భారతీయులు చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు.    

Updated Date - 2020-10-02T05:00:46+05:30 IST