టీటీడీకి కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయం అప్పగింత

ABN , First Publish Date - 2020-12-06T05:46:37+05:30 IST

పుంగనూరు కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయాన్ని టీటీడీకి అప్పగించారు.

టీటీడీకి కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయం అప్పగింత
ఆలయ పత్రాలను టీటీడీకి అందజేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరు, డిసెంబరు 5: పుంగనూరు కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయాన్ని టీటీడీకి అప్పగించారు.   ఈ మేరకు శనివారం మంత్రి పెద్దిరెడ్డి ఆ ఆలయ రికార్డులను టీటీడీ డిప్యూటీ ఈవో శాంతికి అందజేశారు. తొలుత మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ చిత్తూరు ఏసీ చంద్రమౌళి, టీటీడీ ఏఈవో ధనంజయ, జడ్పీ సీవో ప్రభాకర్‌రెడ్డి, వైసీపీ నాయకులు నాగభూషణం, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:46:37+05:30 IST