ఎండలు బాబోయ్..ఎండలు
ABN , First Publish Date - 2022-04-25T04:55:05+05:30 IST
వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ ఏడాది వేసవి తీవ్రత అంతగా ఉండదని ప్రజలు ఊహించారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉండడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.
తల్లడిల్లుతున్న ప్రజలు
ఉదయం 6 గంటలకే ఉక్కపోత
ఉష్ణోగ్రత ఇంకా పెరిగే అవకాశం
రైల్వేకోడూరు, ఏప్రిల్ 23: వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ ఏడాది వేసవి తీవ్రత అంతగా ఉండదని ప్రజలు ఊహించారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉండడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు గ్రామీణులు పచ్చని చెట్లను ఆశ్రయిస్తున్నారు. ఆహార వ్యవహారాల్లో సైతం మార్పులు చేసుకుంటున్నారు. పట్టణంలో ఉదయం 9 గంటలు దాటితే ప్రజలు రోడ్లపై కనిపించడం లేదు. శీతల పానీయాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎండకు ఎక్కువగా తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఎండ తీవ్రత కారణంగా మామిడి కోతకు వెళ్లేందుకు కూలీలు జడుస్తున్నారు. బెరైటీస్ గనుల్లో పని చేసే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
వేసవిలో నిర్లక్ష్యం తగదు
ఎండలో ఎక్కువగా తిరగరాదు. రోజుకు కనీసం 5 లీటర్ల దాకా నీటిని తాగాలి. తేలికపాటి రంగులున్న దుస్తులు మాత్రమే ధరించాలి. ఎండలో తిరిగినపుడు ఓఆర్ఎస్, మజ్జిగ తీసుకుంటే వడదెబ్బ బారినుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
ుస్తులు మాత్రమే ధరించాలి. ఎండలో తిరిగినపుడు ఓఆర్ఎస్, మజ్జిగ తీసుకుంటే వడదెబ్బ బారినుంచి తప్పించుకునే అవకాశం ఉంది.