బ్యాంకు అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-07-25T06:02:37+05:30 IST
బ్యాంకు అభివృద్ధికి ఉద్యోగులు కష్టపడి పని చేయాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముస్కు కర్ణాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి
నల్లగొండ, జూలై 24: బ్యాంకు అభివృద్ధికి ఉద్యోగులు కష్టపడి పని చేయాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముస్కు కర్ణాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం పాలకవర్గం కృషి చేస్తోందన్నారు. భవిష్యత్లో ఉద్యోగులకు మంచి పేస్కేలు ఇప్పిస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా సింగం రాజు, ఉపాధ్యక్షుడిగా సుగున్కుమార్, సెక్రటరీగా ఎస్కె అలీముద్ధీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రవన్కుమార్, ప్రసన్నజ్యోతి, శ్రీధర్రెడ్డి, కోశాధికారిగా రవిచంద్ర, డైరెక్టర్లుగా అనిల్కుమార్, ప్రవీణ్, శ్రీకాంత్, ఉదయ్, రాగిణి, జయయ్య, రఫి పాల్గొన్నారు.