ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-12-06T04:53:23+05:30 IST
ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ మండల అధ్యక్షుడు వీఎస్ఆర్ఎస్.ఆచార్యులు అన్నారు.
కామవరపుకోట, డిసెంబరు 5: ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ మండల అధ్యక్షుడు వీఎస్ఆర్ఎస్.ఆచార్యులు అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం నూతన కమిటీ ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షుడిగా బి.మోక్షానందం, అధ్యక్షుడిగా ఎం.రాజా, ప్రధాన కార్యదర్శిగా వీఎస్ఆర్ఎస్.ఆచార్యులు, అసోసియేటెడ్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు బి.రత్నకుమారిని ఎంపిక చేశారు. రాష్ట్రకార్యదర్శి పి.వి.నరసింహారావు ముఖ్య అతిధిగా పాల్గొన్న కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం.శ్యాంబాబులు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం, ప్రతిజ్ఞ చేయించారు.