ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2022-05-23T06:23:22+05:30 IST
కారు డ్రైవర్ మృతికి కారణమైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా
తుమ్మపాల, మే 22: కారు డ్రైవర్ మృతికి కారణమైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భీమునిగుమ్మం అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పడం, ఎమ్మెల్సీ తన కారులో తీసుకురావడం, పోలీసులు రోడ్డు ప్రమాదం జరగలేదని ప్రకటించడం అనుమానాలకు తావిస్తున్నదని బుద్ద, పీలా పేర్కొన్నారు. అలాగే సుబ్రహ్మణ్యం మృతి పై విశ్రాంత జడ్జితో న్యాయ విచారణ జరిపించి జగన్రెడ్డి ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల దాష్టీకాలు పెచ్చుమీరిపోతున్నాయని, వారికి ప్రజలంతా బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు, టీడీపీ నాయకులు సూరే సతీశ్, మళ్ల గణేశ్, కుప్పిలి జగన్, కోట్ని రామక ృష్ణ, దొడ్డి జగదీశ్వరరావు, ఆకుల నానాజీ పాల్గొన్నారు.