అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నర్సింహారెడ్డి
ABN , First Publish Date - 2021-04-01T05:21:04+05:30 IST
అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నర్సింహారెడ్డి
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్జిల్లా ప్రతినిధి/మేడ్చల్ అర్బన్): మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఏనుగు నర్సింహారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్వేతామహంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని రంగాల్లోనూ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పక్కాప్రణాళికలతో విజయవంతం అయ్యేలా కృషి చేస్తానన్నారు. కరోనా రెండో దశ విస్ర్తృతంగా వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. ప్రజలు అందుబాటులో ఉన్నటువంటి ఆస్పత్రుల్లో కరోనా టీకాను వేసుకోవాలని కోరారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అధికారులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎఎ్సడీగా బదిలీ అయిన అదనపు కలెక్టర్ విద్యాసాగర్కు అధికారులు, కలెక్టరేట్లోని సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి, వీడ్కోలు పలికారు.