బస్టాండ్‌లో ఎలక్ర్టానిక్‌ శానిటైజర్లు

ABN , First Publish Date - 2020-07-06T09:41:09+05:30 IST

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ..

బస్టాండ్‌లో ఎలక్ర్టానిక్‌ శానిటైజర్లు

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ప్రయాణికుల  భద్రతను దృష్టిలో ఉంచుకుని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఎలక్ర్టానిక్‌ శానిటైజర్‌ యంత్రాలను ఏర్పాటుచేశారు. వీటి కింద చేతులు పెడితే చాలు.. టచ్‌ చేయకుండానే నిర్ణీత పరిమాణంలో శానిటైజ్‌ లిక్విడ్‌ బయటకు వస్తుంది. సెన్సార్ల ద్వారా ఇవి పనిచేస్తాయి. పీఎన్‌బీఎస్‌లోని 8, 10 ప్లాట్‌ఫాంల వద్ద వీటిని ఏర్పాటుచేశారు. కొద్దిరోజుల్లో ప్రతి ప్లాట్‌ఫాం దగ్గర ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2020-07-06T09:41:09+05:30 IST