ఎన్నికలు.. ఎక్కడ.. ఏంటి..
ABN , First Publish Date - 2021-01-25T07:16:27+05:30 IST
స్థానిక సంస్థల ఎన్ని కలకు నోటిఫికేషన్ జారీకావడంతో జిల్లా యం త్రాంగం ప్రక్రియ సరళికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి సూత్రప్రాయంగా సంఘం పేర్కొన్న జాబితా అనుసరించి కథన రంగానికి సిద్ధం కావాలని సంబంధిత శాఖ జిల్లా పంచాయతీ కార్యాలయాధికారులు, సిబ్బందికి మౌఖిక ఆదేశాలి చ్చింది.
నాలుగు విడత ల్లో పంచాయతీ 8 విఽధుల్లో 55 వేల మంది సిబ్బంది
12,048 పోలింగ్ కేంద్రాల్లో 11,782 వార్డు సభ్యులకు ఎన్నికలు
300 సమస్యత్మాక, 211 అతి సమస్యాత్యక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
కాకినాడ (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్ని కలకు నోటిఫికేషన్ జారీకావడంతో జిల్లా యం త్రాంగం ప్రక్రియ సరళికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి సూత్రప్రాయంగా సంఘం పేర్కొన్న జాబితా అనుసరించి కథన రంగానికి సిద్ధం కావాలని సంబంధిత శాఖ జిల్లా పంచాయతీ కార్యాలయాధికారులు, సిబ్బందికి మౌఖిక ఆదేశాలి చ్చింది. దీంతో జిల్లాలో ఉన్న 64 మండలాలకు గాను 61 మండలాల్లోని 1072 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 11,782 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి 12,048 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 29,62,292 మంది గ్రామీణ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ స్షేషన్లల్లో 300 సమస్యత్మాక, 211 అతి సమస్యాత్యక కేంద్రాలను గుర్తించారు. విఽధుల్లో 55 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలుస్తోంది.