ఎన్నికల నియమావళి పాటించాలి: జేసీ వెంకటరావు
ABN , First Publish Date - 2021-02-27T05:34:09+05:30 IST
మునిసిపల్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్య ర్థులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిం చాలని మున్సిపల్ ప్రత్యేకాధికారి, జేసీ వెంకటరావు కోరారు.
బొబ్బిలి (రామభద్రపురం), ఫిబ్రవరి 26: మునిసిపల్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్య ర్థులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిం చాలని మున్సిపల్ ప్రత్యేకాధికారి, జేసీ వెంకటరావు కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేం దుకు కృషి చేయాలన్నారు. పార్టీల గుర్తులతో ఎన్నికలు జరుగుతున్నాయని, మార్చి 10న పోలింగ్, 14న కౌం టింగ్ నిర్వహిస్తారన్నారు. ఎన్నికల రిసెప్షన్ సెంటర్, ఎన్నికల సమగ్రి పంపిణీకి సంబం ధించిన ఏర్పా ట్లను పరిశీలించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచార సామగ్రిపై కూడా అధికారులతో చర్చించారు. మున్సిపల్ కమిషనర్ ఎంఎం.నాయుడు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.