పింఛన్ రాలేదంటూ వృద్ధుల ఆందోళన
ABN , First Publish Date - 2022-10-05T04:23:18+05:30 IST
రెండు నెలలుగా పింఛన్లు రావడం లేదంటూ మండల కేంద్రానికి చెందిన వృద్ధు లు మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
తాడూరు, అక్టోబరు 4: రెండు నెలలుగా పింఛన్లు రావడం లేదంటూ మండల కేంద్రానికి చెందిన వృద్ధు లు మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంపీవో లక్ష్మణ్ నాయక్కు వినతిపత్రం అందించారు. ఈ విషయమై ఎంపీడీవో గంగామోహన్ను వివరణ కోరగా.. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకు సంబంధించి పోస్టాఫీసు అకౌంట్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బ్యాంక్కు అనుసంధానంగా ఉన్న పింఛన్దారులకు డబ్బు జమ కాలేదని అన్నారు. వృ ద్ధులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అయి నప్పటికీ రెండు, మూడు రోజుల్లో పింఛన్లు పంపిణీ చే స్తామన్నారు.