రోడ్డుప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-01-16T04:58:30+05:30 IST

కూరగాయలు తీసుకుని సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న శ్రీరాముల రూబెన్‌(64)ను లారీ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డుప్రమాదంలో వృద్ధుడి మృతి
రూబెన్‌ మృతదేహం

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 15: కూరగాయలు తీసుకుని సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న శ్రీరాముల రూబెన్‌(64)ను లారీ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంక్రాంతి పండుగ రోజున కొర్రపాడురోడ్డులో చోటు చేసుకున్న ఘటనలోకెళితే....  పట్టణ శివారు కాల్వకట్టవీధిలో శ్రీరాముల రూబెన్‌, కాంతమ్మ దంపతులు నివసిస్తు న్నారు.

రూబెన్‌ బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం రూబెన్‌ సైకిల్‌పై మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తుండగా మహ ర్షి హైస్కూల్‌ వద్ద లారీ వెనుకనుంచి వచ్చి ఢీకొంది. దీంతో రూబెన్‌ తలకు తీవ్రగాయమై, అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని, ప్రమాద తీరుపై ఆరా తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం జిల్లాఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

రూబెన్‌ మృతితో భార్య కాంతమ్మ పిల్లలు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ భోరున విలపించడం పలువురిని కలచివేసింది. కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ సీఐ క్రిష్ణయ్యయాదవ్‌ తెలిపారు. 

కారు ఢీ కొనడంతో యువకుడు...

రైల్వేకోడూరు, జనవరి 14: మోటారు బైకును కారు ఢీకొనడంతో పులియాల శివమణి (23) మృతి చెందాడు. అనంతరాజుపేట పంచాయతీ మంగంపేట అగ్రహారం జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానికులు అందించిన వివరాల్లోకెళితే...

 చిట్వేలి మండలం నేతివారిపల్లె దళితవాడ వాసి శివమణి రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం సమీప హెచ్‌పీ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని నేతివారిపల్లెకు వెళుతుండగా అగ్రహరం వద్ద టీఎస్‌ 13ఈటీ0528  నెంబరు కారు శివమణి మోటారు బైక్‌ను ఢీకొంది.

దీంతో ఒక్కసారిగా మోటారు బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. శివమణి అక్కడికి అక్కడే మృతి చెందాడు. రైల్వేకోడూరు సీఐ ఆనందరావు, ఎస్‌ఐ పెద్దఓబన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృత దేహన్ని శవపరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పండుగ పూట శివమణి మృతిచెందడంతో నేతివారిపల్లె దళితవాడలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బ్రహ్మంసాగర్‌లో పడి ఒకరు

బ్రహ్మంగారిమఠం, జనవరి 15: బ్రహ్మంసా గర్‌ ప్రాజెక్టులో జాకీర్‌హుస్సేన (42) మృ తిచెందినట్లు బి.మఠం ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. రిజర్వాయర్‌లో ప్రొద్దుటూరు  భగతసింగ్‌ కాలనీ వాసి జాకీర్‌హుస్సేన వ్యక్తిగత సమస్యలతో నీటిలో దూకి ఆత్మ హత్య చేసుకుని ఉండవచ్చని,  సూసైడ్‌ లెటర్‌లో ఉన్నట్లు  ఎస్‌ఐ  తెలిపారు. పూర్తి వివరాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - 2021-01-16T04:58:30+05:30 IST