టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-02-26T03:38:28+05:30 IST
టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి ఫారూక్ హుస్సేన్ అన్నారు.
-ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్
రెబ్బెన, ఫిబ్రవరి25: టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి ఫారూక్ హుస్సేన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు సమీక్షా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు ఎమ్మెల్సీ చేతుల మీదుగా సభ్యత్వ రశీదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, మండల శాఖాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, ఎంపీపీ సౌంధర్య, జడ్పీటీసీ సంతోష్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సోమశేఖర్, సింగిల్విండో చైర్మన్ సంజీవ్కుమార్ పాల్గొన్నారు.