23న విద్యా సంస్థల బంద్‌

ABN , First Publish Date - 2022-08-17T05:22:16+05:30 IST

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను ఉమ్మడిజిల్లాలో విజయవంతం చేయాలని మంగళవారం ఏలూరులో జరిగిన విద్యార్థి సంఘాల సమావేశంలో తీర్మానించారు.

23న విద్యా సంస్థల బంద్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 16 : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను ఉమ్మడిజిల్లాలో విజయవంతం చేయాలని మంగళవారం ఏలూరులో జరిగిన విద్యార్థి సంఘాల సమావేశంలో తీర్మానించారు. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐఎస్‌ఏ విద్యార్థిసంఘాల నాయకులు కె.నాని, గౌరీశంకర్‌, అఖిల్‌, క్రాంతి, జానకీరామ్‌లు మాట్లాడుతూ మొత్తం 10 రకాల డిమాండ్‌లను ప్రభుత్వం ముందు ఉంచామ న్నారు. వీటిని వెంటనేపరిష్కరించ కపోతే విద్యార్థిఉద్యమాలు తప్పవని హెచ్చ రించారు. విద్యాసంస్థల బంద్‌ పోస్టర్లను విడుదల చే శారు.


Updated Date - 2022-08-17T05:22:16+05:30 IST