అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-08-11T06:15:21+05:30 IST
అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలని
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
మంగళ్హాట్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. టీఆర్ఎ్సలో చాలా మంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలకు పాల్పడ్డ వారు మాత్రమే పదేపదే ఈడీ కేసుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, త్వరలో ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరనున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 21న అమిత్షా సభలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.