సులభతరంగా ధరణి పోర్టల్
ABN , First Publish Date - 2020-10-20T06:09:22+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం దసరాకు ప్రారంభించనున్న ధరణి పోర్టల్ పనితీరు సులభతరంగా ఉందని తహసీల్దార్ అంజద్ పాషా తెలిపారు
ఆళ్లపల్లి, అక్టోబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం దసరాకు ప్రారంభించనున్న ధరణి పోర్టల్ పనితీరు సులభతరంగా ఉందని తహసీల్దార్ అంజద్ పాషా తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ రిజిస్ట్రేషన్ విధానం పారదర్శకంగా ఉందని, దసరా నుంచి వెబ్సైట్ ప్రజలకు అందుబాటులో ఉం టుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.