రష్యాలో భూకంపం...భయాందోళనల్లో జనం

ABN , First Publish Date - 2020-09-22T11:55:17+05:30 IST

రష్యా దేశంలో భూకంపం సంభవించింది. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది....

రష్యాలో భూకంపం...భయాందోళనల్లో జనం

మాస్కో (రష్యా): రష్యా దేశంలో భూకంపం సంభవించింది. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. రష్యాలోని స్లయిడీన్ స్కై జిల్లా కుల్ టూక్ ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ ప్రతినిధి వెల్లడించారు. బైకల్ లేకల్ ప్రాంతంలో సోమవారం రాత్రి సంభవించిన మరో భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఈ భూకంపాలతో ప్రజలు భయాందోళనలు చెందారు.ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియలేదు.

Updated Date - 2020-09-22T11:55:17+05:30 IST