ఢిల్లీని కుదిపేయనున్న భారీ భూకంపం
ABN , First Publish Date - 2020-06-07T08:31:14+05:30 IST
దేశ రాజధాని, పరిసర ప్రాంతాలను రానున్న రోజుల్లో ఒక భారీ భూకంపం కుదిపేసే అవకాశం ఉందని ధన్బాద్
- ధన్బాద్ ఐఐఎం నిపుణుల వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 5: దేశ రాజధాని, పరిసర ప్రాంతాలను రానున్న రోజుల్లో ఒక భారీ భూకంపం కుదిపేసే అవకాశం ఉందని ధన్బాద్ ఐఐఎంలోని భౌగోళిక, భూకంప శాస్త్ర నిపుణులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత మూడు నెలల్లో తక్కువ తీవ్రత కలిగిన 11 వరుస భూకంపాలు ఢిల్లీ రీజియన్ను తాకాయని, ఇవి భవిష్యత్లో శక్తిమంతమైన భూకంపానికి సూచనని పేర్కొన్నారు. కాగా, తాము కచ్చితమైన సమయం, స్థలం, తీవ్రత వంటివి నిర్థారించలేకపోతున్నా.. భారీ విపత్తు మాత్రం పొంచివుందని నమ్ముతున్నామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ చీఫ్ డా.కళాచంద్ సేన్ చెప్పారు.