ఈ-హుండీ ద్వారా స్వామివారికి కానుకలు

ABN , First Publish Date - 2021-05-06T06:23:27+05:30 IST

కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో ఆలయాలు మూసివేయడంతో వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామికి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామికి ఆన్‌లైన్‌ ద్వారా కానుకలు చెల్లించవచ్చని ఈవోలు ముదునూరి సత్యనారాయణరాజు, కృష్ణచైతన్య తెలిపారు.

ఈ-హుండీ ద్వారా స్వామివారికి కానుకలు

ఆత్రేయపురం, మే 5: కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో ఆలయాలు మూసివేయడంతో వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామికి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామికి ఆన్‌లైన్‌ ద్వారా కానుకలు చెల్లించవచ్చని ఈవోలు ముదునూరి సత్యనారాయణరాజు, కృష్ణచైతన్య తెలిపారు. దేవదాయశాఖ వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎంఎస్‌.ఏపీ.జీవీవోజి.ఇన్‌నకు వెళ్లి యూజర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని తదుపరి ఈ-హుండి దేవాలయాల లిస్టులో ఆలయాన్ని ఎంచుకుని గూగుల్‌ పే, ఫొన్‌పే, పేటీఎం, మొబైల్‌ యాప్‌, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌చేసి కానుకలు చెల్లించాలన్నారు.


Updated Date - 2021-05-06T06:23:27+05:30 IST