ద్వితీయ మహాసభను జయప్రదం చేయండి : ఓపీడీఆర్‌

ABN , First Publish Date - 2022-05-19T02:57:41+05:30 IST

ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్‌) ద్వితీయ మహాసభను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. బు

ద్వితీయ మహాసభను జయప్రదం చేయండి : ఓపీడీఆర్‌
కరపత్రాలు విడుదల చేస్తున్న ఓపీడీఆర్‌ బాధ్యులు


కావలిటౌన్‌, మే18: ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్‌) ద్వితీయ మహాసభను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. బుధవారం జనతాపేట లోని కార్యాలయంలో ఓపీడీఆర్‌ బాధ్యులు సీ శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నేతలు చావలి సుధాకర్‌, శివశంకర్‌, జిల్లా బాధ్యులు నారాయణమ్మ, కోటిరెడ్డిలు పాల్గొని మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ ఈనెల 21, 22తేదీల్లో నెల్లూరు టౌన్‌హాల్‌లో మహాసభ జరుగుతుందన్నారు. ఓపీడీఆర్‌ జాతీయ అధ్యక్షుడు సీ భాస్కర్‌రావు, మాజీ కేంద్ర సమాచార  కమిషనర్‌ డాక్టర్‌ మాడభూషి శ్రీధర్‌లు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. 


Updated Date - 2022-05-19T02:57:41+05:30 IST