చంద్రబాబు చొరవతోనే డ్వాక్రా సంఘాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-05-17T05:33:32+05:30 IST

చంద్రబాబు చొరవతోనే డ్వాక్రా సంఘాల ఏర్పాటు

చంద్రబాబు చొరవతోనే డ్వాక్రా సంఘాల ఏర్పాటు
మంచాలలో టీడీపీ సభ్యత్వ నమోదులు అందజేస్తున్న జ్యోత్స్న

మంచాల, మే 16: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చొరవతోనే డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయని తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు తిరుగునగరి జ్యోత్స్న గుర్తుచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మంకు ఇందిర ఆధ్వర్యంలో సోమవారం మంచాలలో నిర్వహించిన టీడీపీ సభ్యత్వ నమోదులో ముఖ్య అతిథులుగా జ్యోత్స్నతో పాటు టీడీపీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కె.కృష్ణమాచారి, రాష్ట్ర ప్రఽధానకార్యదర్శి ఆరీఫ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి చింతకింది చక్రపాణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు శక్తివంచనలేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అధిష్టానం ప్రణాళికలు రూపొందింస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిలమోని రవీందర్‌, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ అధ్యక్షుడు జక్కారాంరెడ్డి, తుర్కయంజాల్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు రావులవీరేష్‌, పార్టీనేతలు నక్కామహేందర్‌, మంగళారం రాములు, బి.ప్రభాకర్‌, బి.అశోక్‌, దూసరిమల్లమ్మ, కసరమోని రాజేష్‌ తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:33:32+05:30 IST