ఎన్నికల నియమావళి ప్రకారం విధులు
ABN , First Publish Date - 2021-04-13T05:20:31+05:30 IST
ఎన్నికల నియమావళి ప్రకారం విధులు
కలెక్టర్ చక్రధర్బాబు
నాయుడుపేట టౌన్ , ఏప్రిల్ 12 : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలని కలెక్టర్ చక్రధర్బాబు సూచించారు. సోమవారం ఆయన పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న బ్యాలెట్ స్పెషలిటేషన్ సెంటర్ను పరిశీలించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో పీవోలకు, ఏపీవోలకు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రంలో ఎన్నికల విధులపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్ర్టాంగ్రూమ్కు చేరిన ఈవీఎంలను పరిశీలించారు. నియోజకవర్గంలో 343 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సరోజిని ఉన్నారు.