సెలవుల వేళ.. విద్యార్థుల సొంతూళ్ల బాట

ABN , First Publish Date - 2021-04-21T06:02:26+05:30 IST

పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సొంతూళ్లబాట పట్టారు. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం మంగళవారం నుంచి నిరవధిక సెలవులను ప్రకటించింది

సెలవుల వేళ.. విద్యార్థుల సొంతూళ్ల బాట

కిటకిటలాడిన అనంత ఆర్టీసీ బస్టాండు


అనంతపురం టౌన, ఏప్రిల్‌ 20: 

పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సొంతూళ్లబాట పట్టారు. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం మంగళవారం నుంచి నిరవధిక సెలవులను ప్రకటించింది. దీంతో విద్యాభ్యాసం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉంటున్న విద్యార్థులు సొంతూళ్లబాట పట్టారు. పెట్టేబేడ సర్దుకుని తల్లిదండ్రులతో కలసి పల్లెలకు వెళ్లేందుకు వచ్చిన విద్యార్థులతో అనంతపురం ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది. బస్సుల్లో సీట్లు పట్టుకునేందుకు పోటీ పడ్డారు. మరికొన్ని రూట్లలో తమ ఊరికి వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందా అని ప్రయాణికులు, విద్యార్థులు వేచిచూడడం కనిపించింది. మొత్తంమీద సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండు పరిసరాలు సందడిగా మారాయి.

Updated Date - 2021-04-21T06:02:26+05:30 IST