డీఆర్‌వోగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకం

ABN , First Publish Date - 2020-10-18T15:12:12+05:30 IST

జిల్లా రెవెన్యూ అధి కారిగా సి.చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న..

డీఆర్‌వోగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకం

డీఆర్‌డీఏ పీడీగా అడ్డయ్య

పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీపై రాక


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ అధికారిగా సి.చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను డీఆర్‌వోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సరెండర్‌ చేసిన డీఆర్‌వో ఎన్‌వీవీ సత్య న్నారాయణకు తూర్పు గోదావరి జడ్పీ సీఈవో పోస్టింగ్‌ని ప్రభుత్వం కల్పించింది. పోస్టింగ్‌ కోసం వేచి చూస్తోన్న టి.భాస్కర్‌నాయుడుని కేఆర్‌ ఆర్‌సీ గుంటూరు జిల్లా ఎస్‌డీసీగా నియమించారు. ఇటీవలే డిప్యూటీ కలెక్టర్‌ గా పదోన్నతి పొందిన  కె.రాములునాయక్‌ని పౌరసరఫరాల శాఖ గుంటూరు విజిలెన్స్‌ విభాగంలో ఎస్‌డీసీగా నియమించారు. ఒంగోలులో ఏపీఎస్‌డీఎంఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.అడ్డయ్యను డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు. 


Updated Date - 2020-10-18T15:12:12+05:30 IST