ఈ నెల 27న ‘2డీజీ’ రెండో విడత : డీఆర్‌డీవో చైర్మన్

ABN , First Publish Date - 2021-05-17T23:11:06+05:30 IST

కరోనా నియంత్రణ ఔషధమైన ‘2డీజీ’ రెండో విడత ఈ నెల 27న అందుబాటులోకి వస్తుందని డీఆర్డీవో చైర్మన్

ఈ నెల 27న ‘2డీజీ’ రెండో విడత : డీఆర్‌డీవో చైర్మన్

న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ ఔషధమైన ‘2డీజీ’ రెండో విడత ఈ నెల 27న అందుబాటులోకి వస్తుందని డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి ప్రకటించారు. అయితే కొంత పరిణామంలోనే తెస్తామని పేర్కొన్నారు. రెగ్యులర్ ఉత్పత్తి మాత్రం జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందని, ప్రతిచోటా, అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన ప్రకటించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సతీశ్ రెడ్డి మాట్లాడుతూ...  ఈ ఔషధం 2డీజీ కణాలపై పనిచేస్తుందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో హల్ద్వానీ, రిషికేశ్‌లో 500 పడకల ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేస్తున్నామని, జమ్మూ కశ్మీర్‌లో, గాంధీ నగర్, గౌహతిలో కూడా 500 పడకల ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-17T23:11:06+05:30 IST