ద్రావిడ వర్శిటీ వీసీగా తుమ్మల రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2020-11-29T06:17:52+05:30 IST
ద్రావిడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఆచార్య రామకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
కుప్పం, నవంబరు 28: ద్రావిడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఆచార్య రామకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు డిపార్టుమెంట్లో ప్రొఫెసర్గా ఉన్న ఈయనను ద్రావిడ వర్శిటీ వీసీగా నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తుమ్మల రామకృష్ణ ద్రావిడ విశ్వవిద్యాలయం చేరుకుని పరిపాలనా భవనంలో అధికారికంగా వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి వీసీగా ఉన్న డాక్టర్ అనూరాధ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వర్శిటీలోని బోధన, బోధనేతర సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. విశ్వవిద్యాలయం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉష, వర్శిటీ ప్రధాన కార్యదర్శి మణి, మణివేలు, అనిల్కుమార్రెడ్డి, రూప సుందర్రెడ్డి, సుభాష్, బాలాజీ తదితరులు పుష్పగుచ్ఛం అందించి, శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వీసీ ఆడిటోరియంలో బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశమయ్యారు. వర్శిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, అందుకు అందరి సహకారం అవసరమని కోరారు.