డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు అందజేయాలి
ABN , First Publish Date - 2022-07-07T04:41:30+05:30 IST
ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లలోనుండి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదనకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్పపొందుతున్న ఆఫ్రిన్, ఆశాలను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
- కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఏసీసీ, జూలై 6: ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లలోనుండి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదనకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్పపొందుతున్న ఆఫ్రిన్, ఆశాలను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని రాజీవ్నగర్లో నిర్మాణం పూర్తయినా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించడం లేదని కొంత మంది తాళాలు పగలగొట్టి వాటిని ఆక్రమించి అందులో నివాసముంటున్నారన్నారు. అధికారులు బలవంతంగా ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం అర్హులకు ఇండ్లు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సల్ల మహేష్, నాయకులు కొండ చంద్రశేఖర్, పూదరి ప్రభాకర్, బోయబత్తుల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.