డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-08-17T06:29:10+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు దేశానికే ఆదర్శం
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

చిలుకూరు, ఆగస్టు 16: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని ఆర్లెగూడెంలో ప్రభుత్వం నిర్మించిన 20 డబుల్‌ బెడ్రూం ఇళ్లల్లో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించిన అనంతరం ఆయన మాట్లాడారు. అర్హులందరికీ   డబుల్‌ బెడ్రూం ఇళ్లు  నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు.  అనంతరం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్మించిన అద నపు గదిని ఆయన ప్రారంభించారు. ఇటీవల మృతిచెందిన మామిడి సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కొండా సైదయ్య, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు జానీమియా, తహసీల్దార్‌ రాజే శ్వరి, డీఆర్‌డీఈ సతీ్‌షబాబు, ఎంపీడీవో ఈదయ్య, సర్పంచ్‌ నాగమణి, ఎంపీటీసీ జయమ్మ నాగేశ్వరరావు, జనార్దన్‌,  గన్నా అశోక్‌, కన్నెగంటి శ్రీనివాస్‌ యాదవ్‌, సాగర్ల నాగేశ్వరరావు, రామనర్సయ్య పాల్గొన్నారు.



Updated Date - 2022-08-17T06:29:10+05:30 IST