అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు
ABN , First Publish Date - 2021-10-20T04:47:36+05:30 IST
నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్బెడ్రూం ఇళ్లను అందిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు.
ఎల్లారెడ్డి, అక్టోబరు 19: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్బెడ్రూం ఇళ్లను అందిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్లారెడ్డికి చెందిన 30 మంది లబ్ధిదారులకు రూ.11లక్షల 24వేల 500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణంలో 300 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, త్వరలో పూర్తవుతాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, పార్టీ మండలాధ్యక్షుడు జలందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీష్, జడ్పీటీసీ ఉషాగౌడ్, శంకర్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింలు, శంకర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.