ఇంటింటికీ జెండాల పంపిణీ
ABN , First Publish Date - 2022-08-10T05:28:29+05:30 IST
పాలమూరు పురపాలికలో వార్డు ప్రత్యేక అధికారులకు మునిసిపల్ కార్యాలయంలో జెండాలను అప్పగించారు.
- ప్రజలకు అందజేస్తున్న చేస్తున్న కౌన్సిలర్లు, అధికారులు
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునివ్వడంతో అధికారులు వాటిని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. కులమతాలు, వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు జాతీయజెండాలను తమ ఇంటిపై ఎగురవేయాలని సూచిస్తు న్నారు. ఇళ్లపై ఎగరేడంతో పల్లెలు, పట్ణణలు జెండాపండగ కోలాహలం నెలకొంది. ఎక్కడ చూసినా త్రివర్ణపతాకం రెపరెపలాడుతోంది.
మహబూబ్నగర్/ పాలమూరు, ఆగస్టు 9 : పాలమూరు పురపాలికలో వార్డు ప్రత్యేక అధికారులకు మునిసిపల్ కార్యాలయంలో జెండాలను అప్పగించారు. వాటిని వార్డు ప్రత్యేక అధికారి, వార్డు కౌన్సిలర్లు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు. పాలమూరు 42వ వార్డులో కౌన్సిలర్ రామలక్ష్మణ్ ఇంటింటికీ తిరుగుతూ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మునిసిపల్ సిబ్బంది వజ్రకుమార్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్, బండల శ్రీను, సత్యన్న, పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఫ భూత్పూర్ : మంగళవారం మునిసిపల్ కార్యాలయం ఆవర ణలో జాతీయ పతాకాలను మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ నూరు ల్ నజీబ్, వార్డు కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ చెన్నకిష్టన్న నాయకులు సత్యనారాయణ, మేనేజర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు.
ఫ మూసాపేట : ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామ పం చాయతీ కార్యదర్శులకు ఎంపీపీ గూపని కళావతి జాతీయ జెండా లను అందజేశారు. ప్రతీ ఇంటిపై జెండాలను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, ఎంపీవో సరోజ, నాయకులు కొండయ్య, ఏపీఎం విష్ణుచారి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ అడ్డాకుల : మండల పరిషత్ కార్యాలయం దగ్గర జాతీయ జెండా లను ఎంపీపీ నాగార్జున్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ విజయకుమార్, సింగిల్విండో అధ్యక్షుడు జితేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఫ హన్వాడ : మండల పరిషత్ కార్యాలయంలో డ్వామా పీడీ యాద య్య, ఎంపీపీ బాలరాజు, జడ్పీటటీససీ సభ్యురాలు విజయనిర్మల గ్రామ కార్యదర్శులకు జాతీయ జెండాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, డీపీఎం అనిల్, ఎంపీవో వెంకట్రెడ్డి, ఏపీఎం సుదర్శన్ పాల్గొన్నారు.
ఫ కోయిలకొండ : ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ 2022 సం వత్సరం నాటికి స్వాత్రంత్యం వచ్చి 75 సంవత్సరాలు కావడంతో ప్రతీ ఒ క్కరు తమ ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, జడ్పీటీసీ విజయాభాస్కర్ సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు అఽధికారులు పాల్గొన్నారు.