అన్నదాతలు ఇబ్బందిపడొద్దు
ABN , First Publish Date - 2020-04-04T10:22:56+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు చూడా లని జడ్పీ సీఈవో
భద్రాద్రి జడ్పీ సీఈవో మధుసూదనరాజు ఫ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
పినపాక/మణుగూరు, ఏప్రిల్ 3: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు చూడా లని జడ్పీ సీఈవో మధుసూదన్ రాజు అన్నారు. శుక్రవారం ఆయన పినపాక, మణుగూరు మండలాల్లోని కొనుగోలు కేం ద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఆయన కొనుగోలు కేంద్రా ల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడా లన్నారు. ఆయన వెంట జిల్లా ఐకేపీ అధికారి నాగజ్యోతి, ఎంపీడీవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఏపీఎం జ్యోతి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నా రు. మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీడీవో సిలా ర్ సాహెబ్, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఏపీవో ఉదయశ్రీ, ఏపీఎం అహ్మదుల్లా పాల్గొన్నారు.