జంటలు కలిసి నిద్రించవద్దు, కౌగిలింతలు,ముద్దులు పెట్టుకోవద్దు

ABN , First Publish Date - 2022-04-07T18:07:20+05:30 IST

కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చైనా దేశంలోని ఆర్థిక కేంద్రమైన షాంఘై నగరంలో ప్రజలకు సంచలన హెచ్చరిక జారీ చేశారు...

జంటలు కలిసి నిద్రించవద్దు, కౌగిలింతలు,ముద్దులు పెట్టుకోవద్దు

Shanghai షాంఘై నివాసితులకు హెచ్చరిక

షాంఘై (చైనా): కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చైనా దేశంలోని ఆర్థిక కేంద్రమైన షాంఘై నగరంలో ప్రజలకు సంచలన హెచ్చరిక జారీ చేశారు.‘‘కలిసి నిద్రించవద్దు, కౌగిలింతలు,ముద్దులు పెట్టుకోవద్దు...’’ అంటూ లాక్‌డౌన్ విధించిన షాంఘై నగరవాసులను హెచ్చరించారు. దీంతో సందడిగా ఉండే షాంఘై నగర వీధులు లాక్ డౌన్ ఆంక్షలతో ఖాళీగా కనిపిస్తున్నాయి. షాంఘై వీధుల్లో కేవలం ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే కనిపిస్తున్నారు.కరోనా కట్టడి కోసం షాంఘై వాసులు కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు.చైనా దేశంలోని షాంఘై నగరం కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్ గా మారింది. దీంతో నగరంలోని 26 మిలియన్ల మంది నివాసితులు ఇళ్లకే పరిమితం అయ్యారు.


కొవిడ్ ప్రబలకుండా పరిమితులు పాటించాలని కోరుతూ డ్రోన్లు తిరుగుతున్నాయి.ఇంటి కిటికీలను కూడా తెరవవద్దని కోరారు.‘‘ఈ రాత్రి నుంచి జంటలు విడివిడిగా పడుకోవాలి, ముద్దు పెట్టుకోవద్దు, కౌగిలింతలు అనుమతించం, విడిగా తినాలి. ఆంక్షలు పాటిస్తున్నందుకు ధన్యవాదాలు’’అని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు హౌసింగ్ సొసైటీ నివాసితులకు చెప్పారు.షాంఘై వీధుల్లో నాలుగు కాళ్ల రోబోలు గస్తీ తిరుగుతూ ఆరోగ్య ప్రకటనలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.


Updated Date - 2022-04-07T18:07:20+05:30 IST